Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోయింది.

Road Accident In Vizianagaram

Road Accident Three Died : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోయింది.

దీంతో స్కూటీపై ప్రయాణిస్తోన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం

మృతులు జన్ని బాలరాజు (21), మర్రి జయరాజు (22), మర్రి శివ(21)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఓడిశాలోని నారాయణపట్నంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు