Student Murder : నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని హత్య చేసి కాల్చేసిన దుండగులు

నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడు వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు.

Thugs killed and burn student : నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడు వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు. కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో రాజేందర్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

అక్కడున్న నేషనల్ హైవే అధికారులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ ప్రసాద్ రావు, మరికొందరు పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడు రాజేందర్ గా గుర్తించారు. అక్కడ కాలిపోయిన సెల్ ఫోన్ ఉండటంతో దానిలో సిమ్ ను తీసుకుని దానిని బట్టి అతను వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు.

AP : ఏపీకి మరో ముప్పు

ప్రతి రోజు రాజేందర్ బస్సులో వింజమూరు నుంచి కావలికి వస్తాడు. అయితే నిన్న కాలేజీకి వచ్చాడు. నిన్నటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని నేషనల్ హైవే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అతని ఒంటిపై కాలిన గాయాలున్నాయి. కొట్టిన గాయాలు, చంపిన గాయాలు లేకపోవడంతో ఇది హత్య లేదా ఏదైనా జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. రాజేందర్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు