Tirumala Srivaru : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు జనవరి కోటాను జనవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలాలయం కార్యక్రమం సందర్భంగా ఆయా రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయలేదు. బాలాలయాన్ని వాయిదా వేయగా.. టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమించాలని టీటీడీ కోరింది.