Dwarampudi Chandrasekhara Reddy : ఏపీలో కొన్ని స్థానాలు అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలని విపక్షం, సిట్టింగ్ స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని అధికార పక్షం.. హోరాహోరీగా తలపడుతున్నాయి. అంతేకాకుండా తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎమ్మెల్యేలు సభలో ఉంటే వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లు భావిస్తున్న అధినేతలు కొన్ని స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి నియోజకవర్గమే కాకినాడ సిటీ.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తే.. ఆయన కోసం సకల అస్త్రాలతో పోరాడుతోంది వైసీపీ. ఇంతకీ కాకినాడ సిటీపై అంత ఫోకస్ ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా నడుస్తున్న రాజకీయం ఏంటి? ఓపెన్ డిబేట్ విత్ కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..
Also Read : ఎన్నికల వేళ జనసేనకు సింబల్ కష్టాలు.. ఈసీ కీలక ఆదేశాలు
పూర్తి వివరాలు..