PM Kisan 20th installment
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జూలైలో (PM Kisan) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) 20వ విడత విడుదల కానుంది.
అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం ఏటా రూ. 6,000 చొప్పున డబ్బులు విడుదల అవుతాయి. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలలో అందుకుంటారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
ఈసారి రూ. 2వేలు డబ్బులు పడేందుకు ముందుగానే రైతులు తమ డాక్యుమెంట్లు, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలి. OTP-ఆధార్ ధృవీకరణ కూడా చాలా ముఖ్యం. అందుకే లబ్ధిదారు రైతులు తమ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.
పీఎం కిసాన్ పోర్టల్ లేదా ఆఫ్లైన్ CSC సెంటర్ విజిట్ చేయడం ద్వారా రైతులు తమ మొబైల్ నంబర్ను ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ పోయినట్లయితే లేదా ప్రస్తుతం యాక్టివ్గా లేకుంటే.. కొత్త నంబర్ను అప్డేట్ చేసుకోవాలి. ఇంతకీ మొబైల్ నంబర్ను ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేయాలి? :
ఆఫ్లైన్ మోడ్లో ఎలా అప్డేట్ చేయాలి? :
మీ మొబైల్ నంబర్ను ఆఫ్లైన్ మోడ్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ కార్డ్, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్తో మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి సిబ్బంది సాయంతో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ 20వ విడత విడుదల? :
ప్రధానమంత్రి కిసాన్ పథకం 20వ విడతను ప్రధాని మోదీ జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది.
మీ PM-కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :