PM Kisan Scheme
PM Kisan 20th Installment Date : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 9.7 కోట్లకు పైగా అర్హులైన రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 2, 2025) రోజున పీఎం కిసాన్ 20వ విడత (PM Kisan) విడుదల చేశారు.
యూపీలోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో అర్హత కలిగిన ప్రతి రైతుకు పీఎం మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులను రిలీజ్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ. 2వేలు చొప్పున జమ కానున్నాయి. అయితే, ఈ పథకం 19వ విడత గత ఫిబ్రవరిలో విడుదల అయిన సంగతి తెలిసిందే.
అర్హత కలిగిన రైతులు వాయిదాను పొందాలంటే e-KYC మాత్రమే కాదు.. ఇతర అవసరమైన పనులను కూడా పూర్తి చేసి ఉండాలి. ఆధార్ ఆధారిత పేమెంట్, e-KYCతో పాటు భూమి విత్తనాలను తప్పనిసరి.
ఈ తప్పనిసరి ప్రమాణాలను పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందలేరు. ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. మీరు e-KYC ప్రక్రియను 3 మార్గాల్లో పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ, బయోమెట్రిక్ ఇ-కేవైసీ, ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు.
పీఎం కిసాన్ సమ్మాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
పీఎం కిసాన్ యోజన పథకం ఏంటి? :
2019లో తాత్కాలిక బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకంగా మారింది. అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున మొత్తం ఏడాదికి రూ. 6వేలు అందుకుంటున్నారు. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో వాయిదాలు విడుదల అవుతున్నాయి. ఈ పీఎం కిసాన్ విడతల నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
పీఎం కిసాన్ 20వ వాయిదాకు ఎవరు అర్హులు? :
పీఎం కిసాన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :