×
Ad

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్‌పై బిగ్ అలర్ట్.. రూ. 2వేలు కోసం రైతుల ఎదురుచూపులు.. 22వ విడత రిలీజ్ డేట్ ఇదేనా?

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ వాయిదా ఎప్పుడు వస్తుంది? లబ్ధిదారు రైతులు రూ. 2వేలు కోసం ఎదురుచూస్తున్నారు. రైతు ఐడీ తప్పనిసరిగా ఉండాలా? లేదా పూర్తి వివరాలివే

  • Published On : February 23, 2026 / 03:21 PM IST

PM Kisan 22nd Installment

  • పీఎం కిసాన్ 22వ వాయిదాపై బిగ్ అప్‌డేట్
  • పీఎం కిసాన్ ఇ-కేవైసీ, ఫార్మర్ ఐడీ తప్పనిసరి
  • రైతుల ఖాతాల్లో రూ. 2వేలు ఎప్పుడు పడతాయంటే?
  • ప్రతి ఏడాదిలో రూ. 2వేలు చొప్పున 3 విడతలు పంపిణీ

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా చిన్న రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రతి ఏడాదిలో రూ.2వేలు చొప్పున 3 విడతలుగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది.

మొత్తం రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని రైతులు అందుకుంటున్నారు. ఈసారి, రైతులు 22వ విడత కింద రూ. 2వేల కోసం ఎదురుచూస్తున్నారు.  ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 2026 మధ్యలో ఎప్పుడైనా 22వ విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు.

పీఎం కిసాన్ 21వ విడత 2025 నవంబర్‌లో విడుదలైంది. ఇప్పుడు 22వ విడత దగ్గర పడుతోంది. లక్షలాది కుటుంబాలు ఈ డబ్బును విత్తనాలు, ఎరువులు, గృహ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి-మార్చి విత్తనాల సీజన్‌లో అయితే, ఈసారి, రైతు ఐడీ, ఇ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే రావాల్సిన విడత డబ్బులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.

Read Also : Oppo Find X8 Pro : వండర్‌ఫుల్ డీల్.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్, ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. నివేదికల ప్రకారం.. 22వ విడత ఫిబ్రవరి 2026 చివరి నాటికి లేదా హోలీ చుట్టూ (ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు) వస్తుందని భావిస్తున్నారు. ఈ పంపిణీ విధానం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి ఆధారంగా ఉంటుంది.

ఆధార్-సీడెడ్ బ్యాంక్ అకౌంట్, భూమి రికార్డులు, e-KYC లేకుండా పేమెంట్లు జరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ ఇ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే వెంటనే (pmkisan.gov.in) విజిట్ చేసి పూర్తి చేయండి. ఈ ప్రక్రియను OTP లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇంటి నుంచి పూర్తి చేయవచ్చు.

స్టేటస్ చెక్ చేయాలంటే? :
మీ లబ్ధిదారుని స్టేటస్ చెక్ చేయడం చాలా సులభం. అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
1. ‘Know Your Status’పై క్లిక్ చేయండి.
2. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ ఎంటర్ చేయండి.
3. క్యాప్చాను ఎంటర్ చేసి ‘Search’ ట్యాప్ చేయండి.

ఇప్పటికే అందుకున్న వాయిదాలు, పెండింగ్ స్టేటస్, ఇ-కేవైసీ సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీరు CSC లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో కూడా సాయంపొందవచ్చు. మీ ఆధార్ లింక్ చేయకపోతే లేదా మీ బ్యాంక్ వివరాలు తప్పుగా ఉంటే ‘Edit Reject Reason’ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎడిట్ చేయవచ్చు. అర్హత కోసం చిన్న లేదా సన్నకారు రైతు ఉండాలి. ఆదాయపు పన్ను బ్రాకెట్‌లోని వారు పెన్షనర్లు లేదా పెద్ద భూ యజమానులు ఈ పథకానికి అనర్హులు.

ఇ-కేవైసీ ఎందుకు? ఎలా పూర్తి చేయాలి? :
నకిలీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పుడు e-KYC తప్పనిసరి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘e-KYC’ సెక్షన్‌లో మీ ఆధార్‌ను ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఆపై వెరిఫై చేయండి. బయోమెట్రిక్ లేదా ఫేస్ స్కాన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త రిజిస్ట్రేషన్లు ఉన్న రైతులు సమీపంలోని (CSC)లో అప్లయ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 21 విడతలుగా రూ. 2.5 లక్షల కోట్లకుపైగా డబ్బులు పంపిణీ చేసింది. 22వ విడత డబ్బులు హోలీకి ముందు విడుదల చేసే అవకాశం ఉంది.