PM-KISAN 22nd instalment
PM-KISAN 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ, హోలీకి ముందు రూ. 2వేలు బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతుందా? లేదా అనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 22వ విడత డబ్బులు పడే తేదీపై కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే, చాలామంది లబ్ధిదారు రైతులు అధికారిక పోర్టల్లో తమ పేర్లను చెక్ చేయవచ్చు. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈలోగా పీఎం కిసాన్కు సంబంధించి అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. లేదంటే రావాల్సిన విడత డబ్బులు కూడా ఆగిపోతాయి. కేంద్ర పథకం కింద అర్హత పొందిన రైతులు సంవత్సరానికి రూ. 6,000 అందుకుంటారు.
ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా వారి బ్యాంకు అకౌంట్లో నేరుగా డిపాజిట్ అవుతాయి. రాబోయే 22వ విడత పొందాలంటే రైతులు ఏయే అర్హతలు ఉండాలి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎం కిసాన్ లబ్ధిదారుల అర్హతలివే :
పీఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లలో సాగు భూమి, చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భూమి రికార్డులు లబ్ధిదారుల గుర్తింపుకు ఆధారం. అయితే, సంస్థాగత భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధిక పెన్షన్ పొందేవారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు వంటి నిపుణులు అనర్హులు. సాగు వ్యవసాయ భూమి లేని వ్యక్తులు కూడా అర్హులు కారు. డాక్యుమెంట్లు కూడా సరిగా ఉండాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :