PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్.. ఈ తేదీ నాటికి 21వ విడత రూ. 2వేలు పడొచ్చు. వెంటనే ఈ పని పూర్తి చేయండి..!
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. 21వ విడత తేదీకి సంబంధించి అప్డేట్ ఇదిగో.. రూ. 2వేలు ఎప్పుడు పడనున్నాయంటే?
- Sreehari A
- Published On : September 16, 2025 / 05:00 PM IST
PM Kisan 21st installment
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 21వ విడత డబ్బులు రూ. 2వేలు పడక ముందే లబ్ధిదారు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలి.
అవసరమైన పని పూర్తి కాకపోతే 21వ విడత డబ్బులు పొందలేరు. అందిన (PM Kisan 21st installment) సమాచారం ప్రకారం.. ఈ 21వ విడత అక్టోబర్ 12 నాటికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. అంటే.. కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, పీఎం కిసాన్ రాబోయే విడత ఎప్పుడు విడుదల అవుతుంది అనేది అధికారికంగా వెల్లడించలేదు.
రైతులు ఈ పని వెంటనే పూర్తి చేయాలి :
మీరు కిసాన్ సమ్మాన్ నిధి యోజన తర్వాతి విడత కోసం చూస్తుంటే.. ముందుగా e-KYC చేయాలి. దాంతో పాటు, రైతులు తమ ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవాలి. ఈ పనులు పూర్తయిన తర్వాత మాత్రమే వాయిదా పొందే అవకాశం ఉంటుంది. e-KYC పూర్తి కాకపోవడం వల్ల మీ వాయిదాలు నిలిచిపోతాయి. ఒకసారి ఈ-కేవైసీ పూర్తి చేశాక కూడా అన్ని విడతలు ఒకేసారి విడుదల అవుతాయి. మీరు జన సేవా కేంద్రానికి వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.
దీపావళికి ముందు 21వ విడత :
గత రికార్డులను పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మధ్య పీఎం కిసాన్ వాయిదాలను విడుదల చేస్తోంది. 2024లో 18వ విడత అక్టోబర్ 5న వచ్చింది. 2023లో, నవంబర్ 15న విడత విడుదల అయింది. 2022లో వాయిదా అక్టోబర్ 17న విడుదల అయింది. ఈ ఏడాదిలో దీపావళి అక్టోబర్ 20న ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే.. దీపావళికి ముందు రైతులకు రూ. 2వేలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
మరో విషయం ఏమిటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ చివరి నాటికి తేదీలను ప్రకటించవచ్చు. ప్రవర్తనా నియమావళి ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కొత్త ప్రకటనలు చేయదు. నిధులు విడుదల చేయదు. అందుకే అంతకన్నా ముందుగానే అక్టోబర్లోనే 21వ విడత విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
e-KYC ఎలా పూర్తి చేయాలి? :
- రైతులు, ముందుగా, మొబైల్ లేదా కంప్యూటర్లో PM-Kisan అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి.
- హోమ్పేజీలో Farmers కార్నర్ సెక్షన్కు వెళ్లండి.
- ‘Farmers Corner’లో మీరు e-KYC ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీరు 12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి ‘Find’ బటన్పై క్లిక్ చేయవచ్చు.
- మీ ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి.
- ఆ తరువాత మీరు (Get OTP)పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. వెబ్సైట్లో ఇచ్చిన ఫీల్డ్లో ఎంటర్ చేయాలి.
- ఆ తరువాత ప్రక్రియను పూర్తి చేసేందుకు మీరు ‘Submit’ బటన్పై క్లిక్ చేయాలి.
మీ పేరును జాబితాలో ఎలా చెక్ చేయాలి?
- రైతులు అధికారిక వెబ్సైట్ (pmkisan.gov.in)లో వారి స్టేటస్ చెక్ చేయవచ్చు.
- ‘Farmer Corner’ సెక్షన్కు వెళ్లి ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
- వివరాల కోసం ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేయండి.
- ‘Beneficiary List’పై క్లిక్ చేసి మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతులు తమ డాక్యుమెంట్లను అప్డేట్ చేస్తే.. దీపావళికి ముందు రూ. 2వేలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
