PM Kisan 21st installment
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 21వ విడత డబ్బులు రూ. 2వేలు పడక ముందే లబ్ధిదారు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలి.
అవసరమైన పని పూర్తి కాకపోతే 21వ విడత డబ్బులు పొందలేరు. అందిన (PM Kisan 21st installment) సమాచారం ప్రకారం.. ఈ 21వ విడత అక్టోబర్ 12 నాటికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. అంటే.. కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, పీఎం కిసాన్ రాబోయే విడత ఎప్పుడు విడుదల అవుతుంది అనేది అధికారికంగా వెల్లడించలేదు.
రైతులు ఈ పని వెంటనే పూర్తి చేయాలి :
మీరు కిసాన్ సమ్మాన్ నిధి యోజన తర్వాతి విడత కోసం చూస్తుంటే.. ముందుగా e-KYC చేయాలి. దాంతో పాటు, రైతులు తమ ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవాలి. ఈ పనులు పూర్తయిన తర్వాత మాత్రమే వాయిదా పొందే అవకాశం ఉంటుంది. e-KYC పూర్తి కాకపోవడం వల్ల మీ వాయిదాలు నిలిచిపోతాయి. ఒకసారి ఈ-కేవైసీ పూర్తి చేశాక కూడా అన్ని విడతలు ఒకేసారి విడుదల అవుతాయి. మీరు జన సేవా కేంద్రానికి వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.
దీపావళికి ముందు 21వ విడత :
గత రికార్డులను పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మధ్య పీఎం కిసాన్ వాయిదాలను విడుదల చేస్తోంది. 2024లో 18వ విడత అక్టోబర్ 5న వచ్చింది. 2023లో, నవంబర్ 15న విడత విడుదల అయింది. 2022లో వాయిదా అక్టోబర్ 17న విడుదల అయింది. ఈ ఏడాదిలో దీపావళి అక్టోబర్ 20న ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే.. దీపావళికి ముందు రైతులకు రూ. 2వేలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
మరో విషయం ఏమిటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ చివరి నాటికి తేదీలను ప్రకటించవచ్చు. ప్రవర్తనా నియమావళి ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కొత్త ప్రకటనలు చేయదు. నిధులు విడుదల చేయదు. అందుకే అంతకన్నా ముందుగానే అక్టోబర్లోనే 21వ విడత విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
e-KYC ఎలా పూర్తి చేయాలి? :
మీ పేరును జాబితాలో ఎలా చెక్ చేయాలి?
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతులు తమ డాక్యుమెంట్లను అప్డేట్ చేస్తే.. దీపావళికి ముందు రూ. 2వేలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.