Ather Energy Plant : ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. బిడ్కిన్లోని ఈ సౌకర్యం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ప్యాక్లను ఉత్పత్తి చేస్తుంది.
భారత్లో ఏథర్ ఔరంగాబాద్ ప్లాంట్ మూడవది. కంపెనీకి ఇప్పటికే తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాటరీ ఉత్పత్తి కోసమైతే.. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఏర్పాటు చేసింది.
హోసూర్ సౌకర్యాలు, బ్యాటరీ ప్యాక్లు, వాహనాలను ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ, ఔరంగాబాద్ యూనిట్ లాజిస్టిక్ ఖర్చులను హేతుబద్ధీకరించడానికి, వినియోగదారులకు పూర్తి చేసిన ఉత్పత్తుల డెలివరీని వేగవంతం చేయడానికి ఏథర్ అనుమతిస్తుంది.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అతిపెద్ద మార్కెట్లలో మహారాష్ట్ర ఒకటి. ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) డేటా ప్రకారం.. ఏథర్ రిటైల్ అమ్మకాలు (FY23) ఆర్థిక సంవత్సరంలో 76,939 యూనిట్ల నుంచి (FY24) ఆర్థిక సంవత్సరానికి 41.53శాతం పెరిగి 108,889 యూనిట్లకు చేరుకున్నాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఏథర్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించడం, రిటైల్ అవుట్లెట్లు, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఏథర్ 450 రేంజ్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది. అందులో 450S, 450X, 450 Apex ఇటీవల లాంచ్ అయిన రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి.
ఏథర్ 450s స్కూటర్ ప్రారంభ ధర రూ.1.16 లక్షలు, ఏథర్ 450x ధర రూ.1.41 లక్షలు, ఏథర్ 450 apex ధర రూ.1.95 లక్షలు, ఏథర్ రిజ్టా రూ.1.10 లక్షలతో అన్ని ధరలు (ఎక్స్-షోరూమ్)కే అందుబాటులో ఉన్నాయి. కంపెనీకి ప్రస్తుతం భారత్ అంతటా 200 ఎక్స్ పీరియన్స్ సెంటర్లు, 1,900 కన్నా ఎక్కువ ఫాస్ట్ ఛార్జర్లు, ఏథర్ గ్రిడ్లు ఉన్నాయి.