WhatsApp Rolls Out 'Silence Unknown Callers' Feature on iOS and Android
WhatsApp Silence Callers Feature : ప్రముఖ వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లో అవాంఛిత కాల్స్ నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేసే కొత్త ఫీచర్ను రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని యాప్ యూజర్లను స్పామ్ కాలర్ల నుంచి కాల్లను సైలంట్ చేసే సెట్టింగ్ను టోగుల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ కాల్లు సాధారణంగా యూజర్ కాంటాక్ట్ లిస్ట్లో లేని ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ యూజర్ ఇబ్బంది పెట్టకుండా నిరోధించడానికి ఈ కొత్త ఫీచర్ రూపొందించింది. ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేయని వాట్సాప్ యూజర్లు, ఏ ఇతర వాట్సాప్ యూజర్ అయినా కాంటాక్ట్ లిస్ట్లో లేని వారితో సహా యాప్ని ఉపయోగించి వారికి కాల్ చేసినప్పుడు ఫోన్ రింగ్ వినిపిస్తుంది.
మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్బర్గ్ , వాట్సాప్ యూజర్లు, ఇప్పుడు తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్లను సైలంట్ చేయవచ్చునని ప్రకటించారు. గత డెవలప్మెంట్లో గుర్తించిన ఫీచర్, యూజర్లకు క్రమంగా అందుబాటులోకి వస్తుంది. Android, iOS యూజర్లు వాట్సాప్ లేటెస్ట్ స్టేబుల్ వెర్షన్లలో సెట్టింగ్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసే యూజర్లు తెలియని కాంటాక్ట్ల నుంచి వచ్చే కాల్స్ డిస్టర్బ్ చేసే వీలుండదు. అయితే, మెసేజింగ్ యాప్ నోటిఫికేషన్ ఏరియాలో, యాప్ లోపల కాల్ను డిస్ప్లే చేస్తుంది.
WhatsApp Rolls Out ‘Silence Unknown Callers’ Feature on iOS and Android
వినియోగదారులు తెలియని వ్యక్తి నుంచి కాల్ను కోల్పోరు. ఈ ఫీచర్ ఫోన్ రింగ్ కాకుండా నిరోధించడం ద్వారా గుర్తు తెలియని నుంచి అవాంఛిత కాల్స్ తగ్గిస్తుంది. ఆండ్రాయిడ్లో ఫీచర్ను యూజర్లు త్రి డాట్స్ మెనుపై నొక్కి Settings> Privacy> Calls నొక్కండి. యాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఆప్షన్ను టోగుల్ చేయవచ్చు. అదేవిధంగా, ఐఫోన్ యూజర్లు సెట్టింగ్ల మెనుని ఓపెన్ చేయడానికి వాట్సాప్ గేర్ ఐకాన్పై నొక్కవచ్చు. ఆపై Privacy > Press Call నొక్కండి. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఆప్షన్ టోగుల్ చేయవచ్చు.
భారత్లో ఇతర ప్రాంతాలలో అనేక మంది యూజర్లు తెలియని నంబర్ల నుంచి స్పామ్ కాల్లను స్వీకరించినట్లు నివేదించిన కొన్ని నెలల తర్వాత ఈ ఫీచర్ వస్తుంది. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా, ఇథియోపియా వంటి దేశాల నుంచి తమకు తెలియని నంబర్ల నుంచి కాల్లు వస్తున్నాయని యూజర్లు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. మెసేజింగ్కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసు పంపుతుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ సమయంలో, వాట్సాప్ స్కామ్, స్పామ్ కాల్లను 50 శాతం తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)పై ఆధారపడే స్పామ్ డిటెక్షన్ సిస్టమ్లను అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లో అవాంఛిత కాల్ల నుంచి యూజర్లు ఎదుర్కొనే అసౌకర్యాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.