Punjab Youth Killed In America : అమెరికాలో పంజాబ్ యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ సంఘటన జార్జియాలో చోటు చేసుకుంది. పంజాబ్లోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్వీర్ సింగ్ అమెరికాలోని జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు.
ఆఫ్రికా జాతీయుడైన వ్యక్తి పట్టపగలు తుపాకీతో ఆ షాప్లోకి ప్రవేశించాడు. పరమ్వీర్ సింగ్ను బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కంప్యూటర్ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్వీర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు నిందితుడు క్రిస్ కోప్లాండ్(26)ను అరెస్ట్ చేశారు.
NRI Murder : అమెరికాలో ప్రవాస భారతీయుడి హత్య..రూ. 7లక్షల కోసం కాల్చి చంపిన దుండగుడు
మరోవైపు పరమ్వీర్ సింగ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలిపించారు. ఒక్కడే కుమారుడు కావడంతో తట్టుకోలేపోతున్నారు. మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంభందించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.
#Breaking | #Punjab Youth Shot Dead Inside Grocery Store in #Georgia, Horrific Video Emerges | WATCH
(Viewer discretion advised) pic.twitter.com/BntaGOIacC
— India.com (@indiacom) September 15, 2022