Bihar SI Beaten By Locals : ఎస్సైను రాళ్లతో, కర్రలతో కొట్టి చంపిన స్ధానికులు

చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.

Bihar cop visiting Bengal for theft case probe beaten to death by locals  : చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. బీహార్ లోని కిషన్ గంజ్ పోలీసు స్టేషన్ ఎస్సై అశ్విన్ కుమార్ ఒక బైక్ చోరీ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ లోని ఉత్తరదీనాజ్ పూర్ లోని గోల్ పోఖర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామానికి వెళ్లారు.

దర్యాప్తులో భాగంగా తమకు లభించిన సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకునేందుకు తనిఖీ చేస్తుండగా స్ధానికులు కర్రలు, రాళ్లతో ఎస్సై పై దాడి చేశారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్సైని ఇస్లాంపూర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

దాడి ఘటన తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు ఎస్సైపై దాడికి కారణమైన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణమైనఇతరులను విచారించి అదుపులోకి తీసుకుంటామని పూర్ణియా రేంజ్ ఐజీ తెలిపారు. కాగా… అశ్విన్ కుమార్ స్ధానిక పోలీసుల సహాయం కోరినప్పటికీ, వారు అతనితో పాటు ఒక బృందాన్ని పంపిస్తామని చెప్పి పంపించలేదని బీహార్ పోలీసు అసోసియేషన్ ఆరోపించింది.

 

ట్రెండింగ్ వార్తలు