Robbery In Kerala: కేరళ రాష్ట్రంలో సినీ‌ఫక్కీలో భారీ దోపిడీ.. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే ..

ముగ్గురు వ్యక్తులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళలోని మలప్పురం వెళ్తున్నారు. తెల్లవారుజాము సమయంలో 3గంటలకు పుథుసేరి సమీపానికి చేరుకున్నారు.

4.5 crores Robbery

Thiruvananthapuram: కేరళ రాష్ట్రంలో సినీ ఫక్కీలో దారిదోపిడీ జరిగింది. దోపిడీ ముఠా రూ. 4.5 కోట్లు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీగా సొమ్మును దోచుకున్న నిందితులను పట్టుకొనేందుకు పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ఓ కారులో సుమారు 4.5కోట్ల నగదుతో వెళ్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించి వారి వద్ద సొమ్మును దోచుకెళ్లారు.

Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

ముగ్గురు వ్యక్తులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళలోని మలప్పురం వెళ్తున్నారు. తెల్లవారుజాము సమయంలో 3గంటలకు పుథుసేరి సమీపానికి చేరుకున్నారు. వారి వద్ద భారీగా సొమ్ము ఉందని గుర్తించిన దొంగల ముఠా.. భారీ ట్రక్కుసాయంతో వారిని కారును ఫాలో అయ్యారు. పుథుసేరి సమీపంలో కారుకు ట్రక్కును అడ్డుగా నిలిపారు. అదే సమయంలో పక్కనే మరో రెండు కార్లు వచ్చి ఆగాయి. ఆ కార్లలో నుంచి కొందరు వ్యక్తులు దిగి ములప్పురం వెళ్తున్న కారులోని ముగ్గురు వ్యక్తులను వారి అదుపులోకి తీసుకున్నారు.

California airport : కాలిఫోర్నియాలో హ్యాంగర్‌ను ఢీకొన్న చిన్న విమానం…ముగ్గురి మృతి

ముగ్గురు వ్యక్తులను, వారి వద్ద ఉన్న డబ్బును వారివెంట తీసుకెళ్లారు. త్రిసూర్ సమీపంలోకి వెళ్లగానే డబ్బును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను వదిలేశారు. బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో వచ్చింది ఎవరు? వారు ఎటు వెళ్లారు అనే విషయాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గుర్తుతెలియని నిందితుల కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు