YS Viveka Murder Case : వివేక హత్య కేసులో 17వ రోజు సీబీఐ విచారణ

మాజీ మంత్రి  వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజు కూడా కొనసాగింది. 17వ రోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు.

Ys Viveka Murder Case

YS Viveka Murder Case : మాజీ మంత్రి  వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజు కూడా కొనసాగింది. 17వ రోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు.

కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్, కడప ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన దంపతులు కృష్ణయ్య యాదవ్, సావిత్రి, కుమారులు కిరణ్ యాదవ్, సునీల్ యాదవ్ లతో పాటు నందిని అనే మహిళను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.