పట్టపగలే బ్యాంకు దోపిడీ

  • Publish Date - October 28, 2019 / 01:24 PM IST

బీహార్ లోని షియోహర్ నగర పంచాయతీలోని యూకో బ్యాంకులో సోమవారం చోరీ జరిగింది. ఆరుగురు సభ్యుల ముఠా సోమవారం మధ్యాహ్న సమయంలో 3మోటారు సైకిళ్లపై బ్యాంకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని కస్టమర్లను తుపాకీతో బెదిరించి బ్యాంకులో ఉన్న 32లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. 

పట్టపగలు బ్యాంకులోకి దొంగలు ప్రవేశించి దోపిడీ చేయటంపట్ల అందరూ విస్మయానికి గురయ్యారు. ఇద్దరు దుండగులు గేటు వద్ద వుండి ఎవ్వరూ బయటకు వెళ్ళకుండా కాపలా కాశారు. లోపలికి వచ్చే కస్టమర్లు లోపలికి వెళ్లకుండా ఆపేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ సంతోష్ కుమార్  ఘటనా స్ధలానికి చేరుకున్నారు. 

పోలీసు జాగిలాల ద్వారా  నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ టీవీ పుటేజిని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టామని ముజఫర్‌పూర్ రేంజ్ ఐజి గణేష్ కుమార్ తెలిపారు. షియోహర్ ఎస్పీ స్వయంగా కేసును దర్యాప్తు  చేస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు