Samantha : బ‌ర్త్‌డే పార్టీకి ముఖ్య అతిథిగా హీరోయిన్ స‌మంత‌..! రూ.50ల‌క్ష‌ల మోసం..

టాలీవుడ్ న‌టి స‌మంత పేరు చెప్పి ఓ వ్య‌క్తి రూ.50 ల‌క్ష‌ల మేర మోసం చేసిన ఘ‌ట‌న చైత‌న్య‌పురి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

Fifty lakh fraud by naming actress Samantha

టాలీవుడ్ న‌టి స‌మంత పేరు చెప్పి ఓ వ్య‌క్తి రూ.50 ల‌క్ష‌ల మేర మోసం చేసిన ఘ‌ట‌న చైత‌న్య‌పురి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. బ‌ర్త్‌డే పార్టీకి సామ్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిపిస్తాన‌ని చెప్పి వ్యాపారి వ‌ద్ద ఓ ఈవెంట్ మేనేజ‌ర్ ఈ మేర వ‌సూలు చేశాడు. దీనిపై స‌ద‌రు వ్యాపారి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

పుట్టిన రోజు వేడుక‌కు టాలీవుడ్ హీరోయిన్ స‌మంతను ముఖ్య అతిథిగా పిలిపిస్తాన‌ని చెప్పి వ్యాపారి రాజశేఖర్ రెడ్డికి ఈవెంట్ మేనేజ‌ర్ సుమంత్ రెడ్డి చెప్పాడు. అయితే.. ఇందుకు రూ.50ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌న్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి మొత్తం న‌గ‌దును సుమంత్‌కు ఇచ్చాడు.

అయితే.. ప‌లు కార‌ణాల వ‌ల్ల పుట్టిన రోజు వేడుక‌లు ర‌ద్దు అయ్యాయి. దీంతో తాను ఇచ్చిన డ‌బ్బుల‌ను తిరిగి ఇవ్వాల‌ని ఈవెంట్ మేనేజ‌ర్‌ను వ్యాపారి అడిగాడు. ఇదిగో అదిగో అంటూ ఏడాది దాటినా కూడా డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో వ్యాపారి రాజ‌శేఖ‌ర్ రెడ్డి చైత‌న్య‌పురి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నిరుద్యోగులూ బీ అలర్ట్.. సాఫ్ట్‌వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం, రూ.10 కోట్లతో పరార్

ట్రెండింగ్ వార్తలు