Girl Kidnap Case
Girl Kidnap Case: ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను హరియాణాలోని ఓ వ్యక్తి(35)కి అమ్మేశారు. ఆ బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో ఈ ఏడాది అక్టోబరు 11న దసరా వేడుకల సమయంలో ఓ బాలికను కొందరు అపహరించారు. దీంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. విచారణలో భాగంగా కొందరు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. ఆ క్రమంలో ఆ బాలిక ఎక్కడ ఉందన్న వివరాలు రాబట్టారు.
ఆ బాలికను కిడ్నాపర్లు హరియాణాలోని సోనిపత్ కు తరలించారని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి ఛత్తీస్గఢ్ నుంచి పోలీసులు వెళ్లి, ఓ ఇంట్లో నుంచి ఆ బాలికను రక్షించారు. ఆమెను తిరిగి ఛత్తీస్గఢ్కు తీసుకువచ్చారు. ఆ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడని తేల్చారు.
ఆ బాలికను కొనుగోలు చేసి, ఆమెపై అత్యాచారం చేసిన సోనిపత్ లోని 35 ఏళ్ల నిందితుడితో పాటు ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. కొరియా జిల్లాకు చెందిన ఆ ముగ్గురు బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు హరియాణా వ్యక్తిని బాలికను అమ్మేయడంలో నిందితులని చెప్పారు.