Madhya Pradesh : మధ్య ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిందో జంట. అనంతరం ఆ శవాన్నిపూడ్చి పెట్టి అదే ఇంట్లో నివసించసాగారు. తాగిన మైకంలో నిజం చెప్పటంతో పోలీసులు ఆజంటను అరెస్ట్ చేశారు.
భోపాల్లోని హఫీజ్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే బబ్లూ మే 23 సోమవారం నాడు మద్యం మత్తులో చేతిలో ఒక పుర్రెతో ప్రత్యక్షమయ్యాడు. తాను నివసించే కోలనీలో ఆ పుర్రెను చూపిస్తూ తన స్నేహితుడు శివదత్ భలేరావును తానే హత్య చేశానని, అతడి పుర్రె ఇదే అని చూపిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేశాడు. గతంలో కూడా తాగిన మైకంలో తన స్నేహితుడిని హత్య చేశానని చెప్పేవాడు.
దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బబ్లూను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాలతో బబ్లూ ఇంట్లో 12 గంటలు తవ్వకాలు జరుపగా శివదత్ భలే రావు మృతదేహం బయట పడింది. అక్టోబర్ 2021 లో ఈ హత్య జరిగినట్లు నిందితుడు వెల్లడించాడు. తన ప్రియురాలితో శివదత్ భలేరావు వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు.
తన ప్రియురాలి సమక్షంలోనే బాదితుడిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వి స్నేహితుడిని పూడ్చి పెట్టారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బబ్లూని, అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Amalapuram High Tension : అమలాపురంలో హైటెన్షన్.. కోనసీమ కోసం కదంతొక్కిన ఆందోళనకారులు, పోలీసులపై రాళ్ల దాడి