భార్య కోసం ఇద్దరు భర్తల ఘర్షణ : ఒకరు హత్య

  • Publish Date - January 24, 2020 / 03:28 AM IST

భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయినా మొదటి భర్త విడిచి పెట్టకుండా అక్కడకూ వచ్చి విసిగించ సాగాడు. దీంతోవిసుగు చెందిన  రెండో భర్త మొదటి భర్తను హత్య చేశాడు… వివరాల్లోకి వెళితే 

కర్ణాటక లోని డీజే హళ్లి(దేవరజీవనహళ్లి) వద్ద కావలభైర సంద్రలో నివసించే ఇలోపర్ భాను, మాంసం వ్యాపారం చేసుకునే ఇర్ఫాన్ ని  నాలుగేళ్ళ క్రితం వివాహాం చేసుకుంది. ఇర్ఫాన్ రోజు తాగి వచ్చి భార్య ఇలోపర్ భానును హింసించసాగాడు.  దీంతో విసుగెత్తిన ఇలోపర్ భాను ఇర్ఫాన్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

కొన్నినెలల క్రితం భాను తౌసిఫ్ అనే ఆటో డ్రయివర్ను పెళ్లి చేసుకుంది. ఈ సంగతి తెలిసిన ఆమె మొదటి భర్త ఇర్పాన్  అప్పడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడుతున్నాడు. భాను, ఆమె రెండో భర్త ఇలా చేయటం బాగోలేదని ఎన్నిసార్లు నచ్చ చెప్పినా వినకుండా ఇర్ఫాన్ తన వైఖరి మార్చుకోకుండా  తరచు ఆమె వద్దకు వెళ్లి గొడవపడుతూనే ఉన్నాడు.

జనవరి22వతేదీ బుధవారం రాత్రికూడా తాగి  ఇలోపర్ భాను ఇంటికి వెళ్లి  గొడవ పడ్డాడు. దీంతో  విసుగు చెందిన తౌసిఫ్ ఆవేశంతో ఇర్ఫాన్ ను కత్తితో గుండెల్లో పొడిచి  హత్య చేశాడు.  సమచారం  తెలుసుకున్న డీజే.హళ్లి పోలీసులు ఘటనాస్థలానికి  చేరుకుని నిందితుడు తౌసిఫ్ ను  అరెస్టు చేశారు.