తల్లితో వివాహేతర సంబంధం…కొడుకును చంపిన ప్రియుడు

Minor boy Kidnapping, killed by mother’s lover : వితంతు మహిళతో, పెళ్లైన వ్యక్తి ఏర్పరుచుకున్న వివాహేతర సంబంధం ఆమె కుమారుడ్ని బలిగొంది. ఈ దారుణం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియాలో నివసించే ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. తన 15 ఏళ్ల కుమారుడితో కలిసి ఆవితంతు మహిళ జీవిస్తోంది. కొన్నాళ్ల క్రితం ప్రదీప్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమేపి వివాహేతర సంబంధావికి దారితీసింది.

ప్రదీఫ్ సింగ్ కు పెళ్లై, భార్యా పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లకు ఈ విషయం ప్రదీప్ ఇంట్లో తెలిసింది. దీంతో అతని కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ప్రదీప్ కుటుంబ సభ్యులు వచ్చి ఆ మహిళను హెచ్చరించారు. ప్రదీప్ తొ అక్రమ సంబంధం వదులుకోవాలని చెప్పారు. కానీ ప్రదీప్ ఆమెను వదిలిపెట్టలేదు. తనతో సంబంధం కొనసాగించాలంటే భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఆమహిళ ప్రదీప్ ను కోరింది. అందుకు ప్రదీప్ అంగీకరించలేదు.

భార్యతో విడాకులు తీసుకోను…కానీ నువ్వు నాతో సంబంధం కొనసాగించాలని ఆ మహిళను ప్రదీప్ ఆదేశించాడు. కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వీరి సంబంధం కొనసాగుతూ ఉండటంతో వారి నుంచి ఆమెకు బెదిరింపులు రాసాగాయి. దీంతో ఆమహిళ ప్రదీప్ ను దూరం పెట్టి మరో వ్యక్తికి దగ్గరైంది. మూడు నెలల క్రితం వారిద్దరూ వివాహాం చేసుకున్నారు.

ఇది సహించలేని ప్రదీప్ తన ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. ఆమెపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఆమె కుమారుడ్ని డిసెంబర్ 22న కిడ్పాప్ చేశాడు. కొడుకును విడుదల చేయాలంటే రూ. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన మాజీ ప్రియురాలికి ఫోన్ చేశాడు. వెంటనే ఆమె పోలీసులను సంప్రదించింది.

ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ ఫరీదాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ప్రదీప్ సింగ్ ను పట్టుకోటానికి అక్కడకు బయలు దేరారు. ఫోన్ వచ్చిన ప్రదేశానికి వెళ్లి చూడగా మహిళ 15 ఏళ్ల కుమారుడు హత్యకు గురై కనిపించాడు. ప్రధాన నిందితుడు ప్రదీప్ సింగ్ మరో వ్యక్తి తప్పించుకు పారిపోగా, కిడ్నాప్, హత్యకు సహకరించిన ప్రదీప్ సోదరుడు కపిల్ సింగ్, అంకిత్ ప్రజాపతి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతోంది.