కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గత వారం ఫరీద్ ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫరీద్ ను భారత్ కు అప్పగించాలని దుబాయ్ పోలీసులను ఇంటర్ పోల్ అధికారులు కోరారు.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త కోణంతోపాటు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఫరీద్ గతంలో 20 సార్లు దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు విచారణలో అతను వెల్లడించారు. దీనికి సంబంధించి కేరళ దౌత్య కార్యాలయం నుంచి తనకు పూర్తి స్థాయిలో సహకారం అందినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం కేరళ పోలీసులు, ఎన్ ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో అతను భారత్ కు అప్పగించాలి.. విచారణలో ఇంకా ఎంతమంది సహకరించారు? ఎక్కడెక్కడి నుంచి బంగారాన్ని సప్లై చేయడానికి ఉపయోగపడ్డాడు.. అనే విషయాలపై ఇంటర్ పోల్ అధికారులు.. దుబాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్వరలోనే దుబాయ్ పోలీసు అధికారులు ఫరీద్ ను ఇంటర్ పోల్ అధికారులకు అప్పగించే అవకాశం ఉంది.
దీంతోపాటు ఫరీద్ దుబాయ్ లో ఏం చేస్తుంటాడన్న కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేశారు. దుబాయ్ లో అతను చిన్న వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబం కూడా పూర్తిస్థాయిలో అక్కడే సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఫరీద్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. అతని పాస్ పోర్ట్ ను కూడా అక్కడి పోలీసులు సీజ్ చేశారు.