జగిత్యాల జిల్లా అంగడిబజార్ లోని భవాని సెల్ పాయింట్ లాట్ మొబైల్ షోరూమ్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
జగిత్యాల : జిల్లాలోని ఓ మొబైల్ షోరూమ్ లో చోరీ జరిగింది. అంగడిబజార్ లోని భవాని సెల్ పాయింట్ లాట్ మొబైల్ షోరూమ్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బొలెరో వాహనంలో వచ్చిన నలుగురు డుండగులు దొంగతనం చేశారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. రూ.60 లక్షల విలువ చేసే మొబైల్స్, రూ.10 లక్షలను దుండగులు దోచుకెళ్లినట్లు షాప్ యజమానులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.