Three Children Drowned : స్వర్ణముఖి నదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతు

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వర్ణముఖి  నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు  చిన్నారులు గల్లంతయ్యారు.

Three Children Drowned : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వర్ణముఖి  నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు  చిన్నారులు గల్లంతయ్యారు. రేణిగుంట మండలం జీపాల్యం వద్ద నలుగురు చిన్నారులు చేపల వేటకు వెళ్ళారు. చేపల కోసం నదిలోకి దిగిన వారు  ప్రవాహానికి కొట్టుకుపోయారు.
Also Read : Omicron : ఆంక్షలు మరింత కఠినం చేయండి.. కేంద్రాన్ని కోరిన రాష్ట్రం
వారిని గమనించిన స్ధానికులు  నిఖిత్ సాయి అనే చిన్నారిని  రక్షించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రప్పించి గాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు