Haryana : హర్యానాలో దారుణం…కుటుంబసభ్యుల ముందే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది....
- saleem sk
- Published On : September 22, 2023 / 10:38 AM IST
Haryana police
Haryana : హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. హర్యానా రాష్ట్రంలోని (Haryana) పానిపట్ పట్టణంలో నలుగురు సాయుధులైన వ్యక్తులు వచ్చి బెదిరించి పురుషులను కట్టివేసి, వారి ముందే వారి మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు.
Imran Khan : బుష్రాబీబీతో పెళ్లి కేసులో ఇమ్రాన్ ఖాన్కు కోర్టు సమన్లు
అత్యాచారం అనంతరం బాధితుల ఇళ్లలోని నగదు, ఆభరణాలు, సెల్ ఫోన్లను దోచుకెళ్లారు. ఈ ఘటనలో అనారోగ్యంతో ఉన్న ఓ మహిళ మరణించింది. రెండు సంఘటనలు ఒకే గ్రామంలో జరిగాయని, ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
