Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు రక్షించారు.

Bapatla: ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల, సూర్యలంక బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానిక జాలర్లు రక్షించారు. మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’లో చిరు ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

మిగిలిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ విద్యార్థులంతా మంగళవారం విజయవాడ నుంచి విహార యాత్ర కోసం బాపట్ల బీచ్‌కు వచ్చారు. మృతులను విజయవాడలోని సింగ్ నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి, మధుగా గుర్తించారు. సముద్రంలోని అలల ధాటికి వీళ్లంతా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు, గజ ఈతగాళ్లు సముద్ర తీరంలో గాలిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు