UP couple : భార్యపై సామూహిక అత్యాచారం…అనంతరం విషం తాగి దంపతుల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది....
- saleem sk
- Published On : September 24, 2023 / 10:52 AM IST
UP couple : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత ఓ జంట విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. (UP couple dies by consuming poison)
Pakistan Drone : అమృత్సర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్..హెరాయిన్ స్వాధీనం
సెప్టెంబర్ 20, 21 తేదీల మధ్య రాత్రి వివాహితపై ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని దంపతుల బంధువులు ఆరోపించారని ఎస్పీ తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తి అతని 27 ఏళ్ల భార్య గురువారం విషం తాగారు. అదే రోజు భర్త చనిపోగా, భార్య శుక్రవారం గోరఖ్పూర్లోని ఆసుపత్రిలో మరణించిందని బస్తీ జిల్లా ఎస్పీ గోపాల్ కృష్ణ తెలిపారు. (Suicide) ఆత్మహత్యకు ముందు దంపతులు నిందితుల పేర్లను పేర్కొంటూ వీడియోను రికార్డ్ చేశారని పోలీసులు తెలిపారు.
Benin Fire : బెనిన్ ఇంధన డిపోలో పేలుడు…34 మంది మృతి
మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376 డి, 306 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా విషం తాగి చనిపోతామని తల్లిదండ్రులు చెప్పారని మృతుడి పిల్లలు పోలీసులకు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఎనిమిది, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
