Uttar Pradesh: పెళ్లిలో రసగుల్లా విషయంలో తలెత్తిన గొడవ ఒకరి మరణానికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలో బుధవారం సాయంత్రం జావెద్, రషీద్ అనే సోదరులకు ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిగింది.
Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
పెళ్లి అనంతరం రాత్రి విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే, విందులో రసగుల్లా స్వీట్లు సరిపడినంతగా లేవు. దీంతో ఈ విషయంలో వధువు తరఫు బంధువులు, వరుడి తరఫు బంధువుల మధ్య వాగ్వాదం మొదలైంది. అది గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఘర్షణ పెద్దదై, ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. చివరకు కత్తులు తీసుకుని, ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తిపోట్లతో గాయపడ్డ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Elon Musk: ట్విట్టర్ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు
అయితే, చికిత్స పొందుతూ సన్నీ అనే 20 ఏళ్ల యువకుడు మరణించాడు. మరో ముగ్గురు ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. సన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.