CTET Exam : దరఖాస్తు, ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ KVS, NVS, సెంట్రల్ టిబెటన్ పాఠశాలల్లో TGT, PRT ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (జులై)-2019 కు సంబంధించిన దరఖాస్తు గడువును మార్చి 12 వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు గడువును కూడా మార్చి 8 నుంచి 15 వరకు పెంచారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి పాఠ్యాంశాలను బోధించడానికి TGT, PRT ఉద్యోగాల్లో చేరవచ్చు.
* దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
* దరఖాస్తు ఫీజు:
– జనరల్,OBC అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.700 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PHC అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.350; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.
* ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
* పరీక్ష విధానం..
– పేపర్-1 :
ప్రైమరీ స్టేజ్ (PRT): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
– పేపర్-2 :
ఎలిమెంటరీ స్టేజ్ (TGT): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
* ముఖ్యమైన తేదీలు..
– ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేదీ: మార్చి 12
– అప్లికేషన్ ఫీజు చెల్లిండానికి చివరితేదీ: మార్చి 13
– దరఖాస్తు ఎడిట్కు అవకాశం: 14.03.2019 – 20.03.2019.
– పరీక్షతేదీ: జులై 7 (పేపర్-2 -ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 -మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు).