ఒకవేళ మీరు గోల్డ్ పై పెట్టుబడి పెట్టిన సంస్థ లేదా యాప్ మూతపడినా, దివాళా తీసినా పెట్టుబడిదారులు నష్టపోవడం ఖాయమని సెబీ వార్నింగ్ ఇచ్చింది. సెబీ కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చింది అవేంటంటే?
- డిజిటల్ గోల్డ్ సర్వీసెస్ అందించే సంస్థల వివరాలను నిపుణులతో చెక్ చేసుకోవాలి.
- ఆ సంస్థల యాప్లకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోండి.
- గోల్డ్ ఈటీఎఫ్లు (ETFs), ఈజీఆర్లను (EGRs) డిమాట్ ఖాతా ద్వారా మాత్రమే కొనాలి.
- ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి మోసపోవద్దు.
- నకిలీ సంస్థలు, యాప్లలో పెట్టుబడులు పెట్టవద్దు, ఒకవేళ ఆ సంస్థ దివాళా తీస్తే మొత్తం పెట్టుబడులు నష్టపోతారు.
- ఇప్పటికే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టి ఉంటే, వెంటనే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకోండి.
- పెద్దగా పేరు లేని సంస్థల్లో కాకుండా, సెబీ నియంత్రణలోని సంస్థల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి.
పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.