అమెరికాలో నకిలీ విశ్వవిద్యాలయం బారిన పడిన 30 మంది విద్యార్థులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి నకిలీ విశ్వవిద్యాలయం బారిన పడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ నిర్బంధానికి గురైన వారిని విడిపించడానికి అమెరికాలోని భారత విదేశాంగ కార్యాలయం, తెలుగు సంఘాలు చొరవ తీసుకోవడంతో ఇప్పటి వరకు 30 మంది బయటపడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులు స్వగృహాలకు వెళ్లారు. అమెరికాలో చేదు అనుభవం చవి చూశామని విద్యార్థులు వాపోయారు. మిగిలిన విద్యార్థులను కూడా రప్పించేందుకు విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Read Also: జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ
Read Also: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్పై విచారణ
Read Also: షాక్ లో స్టూడెంట్స్ : అమెరికాలో మరో 5 ఫేక్ యూనివర్సిటీలు!
Read Also: అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్లో తెలుగు విద్యార్థులు