హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. తెలంగాణాలో ఉన్న 17 స్థానాలకు 9 స్థానాల్లో పోటీచేయనుంది. తెలంగాణాలోని ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరి, మహబూబర్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సికింద్రాబాద్, భువనగిరి స్థానాలలో పోటీ చేయనుంది. 2018 డిసెంబర్ లో అధికారికంగా ప్రారంభించిన ఈ పార్టీకి ఎన్నికల సంఘం గ్యాస్ పొయ్యి గుర్తును కేటాయించింది.
Read Also : దేవడా : ఓటర్ల లిస్టులో బాహుబలి, ఇడ్లీ, సెక్స్, నిట్
మరో రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపకురాలు శ్వేతా శెట్టి తెలిపారు. మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటున్న తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించేందుకు నాలుగు కమిటీలను వేశామని తెలిపారు. ఈ క్రమంలో ఇతర రాజకీయ పార్టీల నుండి మహిళలు సభ్యులు.. మహిళా NGO లు అడ్వకేట్స్ జర్నలిస్టు లు తమకు మద్దతు తెలుపుతున్నారని శ్వేత తెలిపారు.
రాజకీయాల్లోకి రావటానికి ముందు డాక్టర్ గా పనిచేసిన శ్వేతా శెట్టి 2023 నాటికి తమ పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ మహిళల నుంచి తమకు మద్దతు లభిస్తోంది..కానీ మహిళా పార్టీలోకి వారు ప్రత్యక్షంగా పాల్గొందుకు వెనుకాడుతున్నారన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి పెద్దగా రాజకీయ అనుభవం లేనందుకు మహిళా పార్టీ నుంచి పోటీచేసేందుకు వెనుకాడుతున్నారని డాక్టర్ శ్వేత తెలిపారు.
దేశంలో మహిళలకు రాజకీయంగా సాధికారమివ్వటానికి తన బృహత్తర నినాదాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేబినెట్లో ఒక్క స్త్రీ కూడా లేదనీ..మహిళలు లేనిదే మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా పురుషులే నిర్వహిస్తున్నారనీ ఆమె విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..మహిళలు..బాలికల సంక్షేమం వెల్లివిరిసేలా సంస్కరణలు తీసుకునేందుకు పాటు పడతామని డాక్టర్ శ్వేత శెట్టి తెలిపారు.
Read Also : ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో పోటీ