చేపల వ్యాపారి రమేష్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు : మహిళతో పాటు నిందితుడు అరెస్ట్

  • Publish Date - February 5, 2020 / 06:56 AM IST

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపిన చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఎనిమిది గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. సదరు నిందితురాలు మహిళ ద్వారా రమేశ్ ను నిందితుడు రాజు రమేశ్‌ను హత్య చేయటానికి రంగంలోకి దింపినట్లుగా పోలీసులు గుర్తించారు. డబ్బులో కోసమే రాజు రమేశ్ ను హత్య చేసినట్లుగా గుర్తించారు. రమేశ్ ఒంటిమీదున్న బంగారాన్ని రాజు తాకట్టు పెట్టాడనీ తెలిసింది. రమేశ్ కు వచ్చిన కాల్ డేటా..సీసీ కెమెరాల ఆధారంగా రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.   

కాగా..హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో  గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపింది. ఇంటి పెంట్ హౌస్‌లో గోనె సంచిలో శవం లభ్యం అయ్యింది. జవహర్‌నగర్‌‌ ప్రాంతంలో చేపల వ్యాపారం చేసుకునే రమేష్ ను  నిందితులు హత్య చేసి గోనె సంచిలో కట్టి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్‌ బోరబండలోని రామారావు నగర్ కు చెందిన చేపల వ్యాపారి రమేష్‌ను గుర్తు తెలియని దుండగులు ఫిబ్రవరి 1వ తేదీన  కిడ్నాప్ చేశారు.  2వ తేదీ  ఉదయం రమేష్ సెల్ ఫోన్ నుంచి అతని కోడలు ఫోన్ కు కొన్ని మెసేజ్ లు వచ్చాయి. రమేశ్ మద్యం సేవించాడని… వాంతులయ్యాయని.. నిద్ర లేవగానే తీసుకువస్తామని మెసేజ్ లు వచ్చాయి. ఆ తర్వాత ఇంక రమేష్ సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. అనుమానం  వచ్చిన కుటుంబ సభ్యులు 2న ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తరువాత 3వతేదీ మధ్యాహ్నం మళ్లీ రమేష్ సెల్ ఫోన్ నుంచి  వాట్సప్ మెసేజ్ వచ్చింది. రమేష్ ను కిడ్నాప్ చేశామని…రూ.90 లక్షలు ఇస్తే వదిలిపెడతామని.. లేదంటే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించారు. 4వతేదీ మంగళవారం మధ్యాహ్నం  లోపు డబ్బులు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారు. 

అలర్టైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద రమేష్ ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే…. మంగళవారం సాయంత్రం జవహర్ నగర్ లోని ఒక ఇంటి పెంట్ హౌస్ లో శవాన్ని గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో ఆ ఇంటి యజమాని శివ రామ్ కుమార్ తాళం పగల కొట్టి చూడగా.. గోనె సంచిలో కట్టిపడేసిన మృతదేహం కనపడింది. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రమేశ్ కాల్ డేటా..సీసీ కెమెరాల ఆధారంగా రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాస్ తో సహా మరో మహిళను అరెస్ట్ చేశారు.