జూబ్లీ బస్టాండ్ దగ్గర కోదండరామ్ అరెస్ట్

ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు

  • Publish Date - October 19, 2019 / 02:19 AM IST

ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు

ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతిచ్చాయి. శనివారం(అక్టోబర్ 19,2019) రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పాయి. అయితే… పలుచోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న కార్మికులు, నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గర టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జేబీఎస్ ముట్టడికి వచ్చిన కోదండరామ్ తో పాటు టీడీపీ నేతలు ఎల్.రమణ, రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరించారు. 

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు. తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం కోర్టుకు కూడా వెళ్లారు. చర్చలు జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. కార్మికులు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. 

సర్కార్ వైఖరికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ యూనియన్లకు అనూహ్య మద్దతు లభించింది. కార్మికుల నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విపక్ష పార్టీలు…బంద్‌కు కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం పార్టీలు కార్మికులకు బాసటగా నిలిచాయి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరాయి.