తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ ఆలీ, హరీశ్ రావు, కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.