కొలిక్కిరావడం లేదు : ప్రభుత్వ కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య చర్చలు

  • Publish Date - October 3, 2019 / 03:20 PM IST

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచిస్తోంది.

సమ్మె అనివార్యమైతే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అనుభవం ఉన్న డ్రైవర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ప్రాథమికంగా సూచించారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

చర్చలకు పిలిచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమావేశం నుంచి కార్మిక సంఘాల నేతలు బయటకు వెళ్లిపోయాయి. అయితే.. సమ్మె జరిగితే ఏం చేయాలన్న దానిపై కమిటీ చర్చించడంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు మధ్యాహ్నం చర్చలను బహిష్కరించాయి. తిరిగి అధికారులు పిలవడంతో.. మళ్లీ భేటీ అయ్యి.. డిమాండ్లను పరిష్కరించాలని కోరాయి. ఈ చర్చలకు టీఎంయూ, ఈయూ నేతలు హాజరయ్యారు.