COVID-19
COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,542 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 1,919 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 26,449 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉందని తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉన్నట్లు చెప్పింది.
రికవరీ రేటు ప్రస్తుతం 98.76 శాతంగా ఉన్నట్లు వివరించింది. నిన్న దేశంలో 4,23,087 డోసుల కరోనా వ్యాక్సిన్ వినియోగించారని పేర్కొంది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,40,77,068కి చేరిందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 89.89 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
నిన్న 2,27,207 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 219.37 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. వాటిలో 94.96 కోట్ల రెండో డోసులు, 21.89 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నట్లు తెలిపింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..