Delhi University: మోదీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నల్లరంగు దుస్తులు ధరించవద్దు
ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి...
- saleem sk
- Published On : June 30, 2023 / 05:46 AM IST
Delhi University PM Modi visit
Delhi University PM Modi visit : ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి. మోదీ పాల్గొనే శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఢిల్లీలోని హిందూ కళాశాల, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాల, జాకీర్ హుసేన్ కళాశాలల్లో మోదీ పర్యటన సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నందున విద్యార్థులంతా నల్లరంగు దుస్తులు ధరించరాదని ఆదేశాలు జారీ చేశారు.
Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు
విద్యార్థులు ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలని, సమావేశానికి గంటన్నర ముందుగా రావాలని హిందూ కళాశాల ఉపాధ్యాయుడు-ఇన్చార్జ్ మీను శ్రీవాస్తవ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుపై హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవను అడగ్గా, పరిపాలన అటువంటి నోటీసును జారీ చేయలేదని చెప్పారు. లైవ్ టెలీకాస్ట్ గురించి విద్యార్థులకు తెలియజేశానని, హాజరుపై బలవంతం లేదని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.
Ration Cards : పేదలకు ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, దేశంలోనే తొలిసారిగా
రాంజాస్ కాలేజ్, మిరాండా హౌస్, కిరోరిమల్ కాలేజ్ కూడా తమ విద్యార్థుల హాజరును తప్పనిసరి చేయలేదని, అయితే విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ప్రధాని మోదీ జూన్ 30వతేదీన మూడు ఢిల్లీ వర్సిటీ భవనాలకు వాస్తవంగా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంమీద మోదీ పర్యటనలో విద్యార్థులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, నల్లరంగు దుస్తులు ధరించరాదనే నిబంధన విధించడం చర్చనీయాంశంగా మారింది.
