Weather Update : పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీవర్షాలు…ఐఎండీ అలర్ట్ జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.....
- saleem sk
- Published On : July 23, 2023 / 01:12 PM IST
Rains
IMD Weather Update : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. (Rains Cause Havoc In Gujarat, Maharashtra) ఇండోర్, రత్లాం, చింద్వారా, మందసౌర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీవర్షాలు (Rains) కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. (IMD Issues Alert For Tamil Nadu, Karnataka)
Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?
రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఆదివారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర ప్రాంతంలో జులై 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
Moscow shopping mall : మాస్కో షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురి మృతి, 10 మందికి గాయాలు
రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబయి, పూణే జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలోనూ తేలికపాటి వర్షం కురిసింది. యమునా నదిలో వరదనీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…
ఆదివారం యమునా నదీ నీటిమట్టం 205.75 మీటర్లకు పెరిగింది. నోయిడాలోని హిండన్ నది శనివారం రాత్రి ప్రమాద స్థాయిని దాటింది మరియు లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో సమీపంలోని అనేక ఇళ్లు నీట మునిగాయి. వరద ఉధృతి పెరగడంతో ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్షపు జల్లుల తీవ్రత ఆదివారం నుంచి తగ్గే అవకాశం ఉంది.
Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య గుజరాత్లో వరదలు వెల్లువెత్తాయ. పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్లో చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి, సహాయక చర్యలను నిర్వహించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను రంగంలోకి దించారు. గుజరాత్ రాష్ట్రంలో జులై 23న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
