China : చైనా వరదల్లో 21 మంది మృతి, ఆరుగురు గల్లంతు
చైనా దేశంలో భారీవర్షాల వల్ల బురద వరదలు వెల్లువెత్తాయి. పర్వత ప్రాంతాల నుంచి బురదజలాలు జియాన్లోని చాంగ్లోని ఒక గ్రామాన్ని తాకాయి. ఈ వరదల్లో ఆదివారం సాయంత్రం నాటికి 21 మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయారు....
- saleem sk
- Published On : August 14, 2023 / 08:08 AM IST
mudslide in China
China : చైనా దేశంలో భారీవర్షాల వల్ల బురద వరదలు వెల్లువెత్తాయి. పర్వత ప్రాంతాల నుంచి బురదజలాలు జియాన్లోని చాంగ్లోని ఒక గ్రామాన్ని తాకాయి. ఈ వరదల్లో ఆదివారం సాయంత్రం నాటికి 21 మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయారు. (mudslide in China) చాంగాన్ జిల్లా శివార్లలోని లువాన్జెన్ టౌన్షిప్లోని వీజిపింగ్ గ్రామంలో బురద జలాలు ముంచెత్తాయి. ఈ విపత్తు కారణంగా జాతీయ రహదారి పక్కన ఇళ్లు దెబ్బతిన్నాయి.
Big accident in America : మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయిన ఫైటర్ జెట్
భారీవర్షాల వల్ల పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. వరదల నేపథ్యంలో జియాన్ నగరంలో ఆన్సైట్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వరదపీడిత ప్రాంతాల్లో 980 కంటే ఎక్కువ మంది అగ్నిమాపక, పోలీసు విభాగాల సిబ్బంది సహా 14 రెస్క్యూ బృందాలను మోహరించారు.
Seema Haider : నోయిడా ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమాహైదర్…సినిమా ఆఫర్ తిరస్కరణ
సహాయ కార్యకలాపాలను నిర్వహించడానికి లైఫ్ డిటెక్టర్లు, శాటిలైట్ ఫోన్లు, ఎక్స్కవేటర్లు, సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్లతో సహా 1,100 యూనిట్ల పరికరాలను సంఘటన స్థలానికి తీసుకువచ్చారు. రెస్క్యూ దళాలు 81 మంది నివాసితులను, 11 వాహనాలను సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. రెండు గంటలపాటు భారీ వర్షం కురవడంతో వరదలు, బురద జల్లులు మొదలయ్యాయని స్థానిక గ్రామస్థుడు తెలిపారు.
