విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు. దీంతో ఎయిర్ పోర్ట్ ఎక్స్ప్రెస్, లైట్ రైల్, ఎమ్టిఆర్ బస్సులతో సహా హెవీ రైల్ను కవర్ చేసే అన్నిMTS(మాస్ ట్రాన్సిస్ట్ ట్రైన్) సేవలను ఈ ఉదయం తిరిగి ప్రారంభించలేమని ఎమ్టిఆర్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వివిధ జిల్లాల్లో హింస చెలరేగిన తరువాత… స్టేషన్లలో నష్టాల పరిధిని పరిశీలించడానికి,అంచనా వేయడానికి, మరమ్మత్తు పనులను నిర్వహించడానికి దెబ్బతిన్న స్టేషన్లకు ప్రయాణించే ముందు నిర్వహణ సిబ్బంది వారి స్వంత భద్రతను నిర్ధారించుకోవాలని ఆ ప్రకటనలో తెలిపింది.
అర్ధ శతాబ్దానికి పైగా ఉపయోగించని అత్యవసర అధికారాలను ప్రభుత్వం విధించినందున, ఫేస్ మాస్క్ ధరించిన నిరసనకారులపై నిషేధం కారణంగా… హింసాత్మక నిరసనల మధ్య శుక్రవారం అన్ని రైలు సర్వీసులు నిలిపివేయబడిన విషయం తెలిసిందే. ఈ నిషేధం దాదాపు నాలుగు నెలల అశాంతిని అరికట్టడానికి ఈ నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. అత్యవసర నిబంధనల ఆర్డినెన్స్ల కింద ఈ ఉత్తర్వులిచ్చినట్లు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ తెలిపారు. ఇది వలసరాజ్యాల యుగం యొక్క ఒక పెద్ద నిబంధన. ఇది శాసనసభను దాటవేయడానికి, అత్యవసర లేదా ప్రజా ప్రమాద సమయంలో ఏదైనా చట్టాన్ని చేయడానికి ఆమెను అనుమతిస్తుంది.
కొత్త చట్టం.. ముసుగు ధరించిన హింసాత్మక నిరసనకారులు, అల్లర్లకు వ్యతిరేకంగా నిరోధక ప్రభావాన్ని సృష్టిస్తుందని మేము నమ్ముతున్నాము. చట్టం అమలులో పోలీసులకు సహాయం చేస్తామని లామ్ శుక్రవారం అన్నారు.