ISI Chief : బిల్గేట్స్తో ఫొటో.. అడ్డంగా బుక్కయిన ఇమ్రాన్ ఖాన్!
లంచ్ మీట్లో ఉన్నది ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అని తెలిసింది. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్ఐ చీఫ్.. ప్రభుత్వానికి చెప్పారట...
- madhu
- Published On : February 20, 2022 / 02:04 PM IST
Pak Imran
Bill Gates Visit Pakistan : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్గేట్స్తో లంచ్ టైంలో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా…మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తాజాగా పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్గేట్స్తో లంచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అందరూ ఓ వ్యక్తి వైపు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది.
Read More : China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ
ఆ లంచ్ మీట్లో ఉన్నది ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అని తెలిసింది. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్ఐ చీఫ్.. ప్రభుత్వానికి చెప్పారట. అందుకే తాజా ఫొటోలో ఆయన ముఖాన్ని మార్ఫ్ చేసినట్లు తెలుస్తోంది. నదీమ్ అంజుమ్ గతేడాది అక్టోబరులో ఐఎస్ఐ నూతన చీఫ్గా నియమితులయ్యారు. అంతకుముందు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న ఫయాజ్ హమీద్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాకు మధ్య వర్గ పోరు మొదలవడంతో హమీద్ను పదవి నుంచి తప్పించారు. అయితే నదీమ్ నియామకాన్ని తొలుత ఆర్మీ మీడియా వింగ్ ప్రకటించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య అంతర్గత పోరు మొదలైనట్లు వార్తలు వినిపించాయి.
