మానవ హక్కులను చైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. నియంతృత్వ పోకడలను సాగిస్తోంది.తాము అనుకున్నదే చట్టం అనే చందంగా వ్యవహరిస్తోంది.మతపరమైన సంప్రదాయాలను విడిచిపెట్టాలని ముస్లింలపై తీవ్ర ఒత్తిడి పెడుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలో చైనాలో 16వేల మసీదులను చైనా అధికారులు కూల్చివేశారు.
వందలాది పవిత్ర స్థలాలు, స్టాటిస్టికల్ మోడలింగ్ను ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా పరిశీలించి రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదికను ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం చైనాలోని జింజియాంగ్లో దాదాపు 16 వేల మసీదులను చైనా అధికారులు కూల్చివేశారు.
దీంతో జింజియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది వీఘర్ ముస్లింలను ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధించారు. సంప్రదాయాలు, మతాచారాలను వదిలిపెట్టాలని స్థానికులపై చైనా అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు.
గత మూడేళ్ళలో దాదాపు 8,500 మసీదులను కూల్చి వేసినట్లుగా తెలుస్తోంది. ఉరుంకి, కష్గర్ ప్రాంతాల్లో మరింత ఎక్కువ సంఖ్యలో మసీదుల్ని థ్వంసం చేశారు. కానీ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవంలేదంటూ చైనా ఖండిస్తోంది.
జింజియాంగ్ ప్రావిన్స్లో మత స్వేచ్ఛ సంపూర్ణంగా ఉందని బొంకుతోంది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్కు ఏమాత్రం విశ్వసనీయత లేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ సంస్థ చైనాకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. జింజియాంగ్లో 24 వేల మసీదులు ఉన్నాయని తెలిపింది.