రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి : WHO

  • Publish Date - June 16, 2020 / 11:03 AM IST

రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత రెండు వారాలుగా ప్రతి రోజు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని..వీటిలో ఎక్కువగా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలు, దక్షిణాసియా దేశాలు ఉంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ సంస్థ చీఫ్ టెడ్రోస్ తెలిపారు. ఒకప్పుడు లక్ష కేసులు పెరగడానికి ఎంతో సమయం అంటే కనీసం రెండు నెలలైనా పట్టేదని.. కానీ గత కొన్ని రోజులుగా ఒక్కరోజులోనే లక్ష కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. 

కరోనా వైరస్ పుట్టిన చైనాలో కూడా రెండో విడత కరోనా కేసులు పెరుగుతున్నాయనీ..దీంతో కరోనాను నియంత్రించగలిగామనుకుంటున్న దేశాల్లో కూడా మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. చైనాలోని బీజింగ్ లో వెలుగు చూసిన రెండో విడత కరోనా కేసు మూలాలను వెతికే పనిలో డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఉన్నారని..దీనికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. జాగ్రత్తలు పాటించాలనీ..దాన్ని ఇంకా కొంతకాలం కొనసాగించాలనీ..లేదంటే కరోనా ఉదృతికి ఇంతకంటే వేరే మార్గం ప్రస్తుతానికి లేదనీ..కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

ఇక ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 80,05,294 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిల 4,35,662 మంది మరణించారు. పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా, బ్రెజిల్. రష్యా తరువాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇలా రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసులతో భారత్ అంతకంతకూ స్థానాలను పెరుగుతుండటంతో ఆందోళలకుదారి తీస్తోంది.