Explosion in Afghanistan అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. కాందహార్లోని షియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది.
మసీదు సమీపంలో బాంబు పేలి ఇప్పటివరకు 32 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ కాబూల్కు విమాన సర్వీసులు నిలిపేసిన పాక్