ఓ రన్నర్ కరోనా తనపై ప్రభావం చూపకూడదని 66కిలోమీటర్లు పరిగెత్తాడు. దగ్గినా, తుమ్మినా, కరోనా పేషెంట్లను తాకినా సంక్రమించే వైరస్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఫిట్గా ఉండాలని చైనా వాసులకు సూచించింది. కరోనా ధాటికి జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు మూసేయడంతో 1.4 బిలియన్ మంది ఇళ్లలోనే ఫిట్నెస్ కోసం ట్రై చేయాలని చెప్పింది.
తోచిన విధంగా కసరత్తులు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో వాటర్ బాటిల్స్ ఎత్తడం, పిల్లలను ఎత్తుకుని పుషప్ప్ చేయడం, మెట్లు ఎక్కడం వంటి ఇండోర్ టెక్నిక్స్ను ఫాలో అవుతున్నారంతా. పాన్ శాంచు(44) అనే వ్యక్తి ఏకంగా అపార్టెమ్ంట్లో మారథాన్నే మొదలుపెట్టేశాడు.
6గంటల 41నిమిషాలు కష్టపడి 66కిలోమీటర్లు పరిగెత్తేశాడు. అనుమానముంటే డేటా ట్రాకర్తో నిరూపిస్తానని కూడా చెప్పాడు. ‘మొదలుపెట్టినప్పుడు కాస్త నీరసంగా అనిపించింది. చేస్తూ పోతే ఇప్పుడు సులువుగానే ఉంది. రన్నింగ్ అనేది ఓ వ్యసనం. అది చేయకపోతే కాళ్లు పరిగెత్తమని దురదపెడుతుంటాయి’ అంటున్నాడు.
అంతేకాదు బాత్రూంలోనూ 30కిలోమీటర్లు పరిగెత్తి దానిని లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఒకసారి వైరస్ గొడవ వదిలిపోతే తాను 100కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. చైనా గవర్నమెంట్ ఫిట్గా ఎలా ఉండాలో చెప్తుండటం కూడా ఇతనికి బాగా కలిసొచ్చింది. ఈ కరోనా ప్రభావంతో చైనావాసులు జనవరి 23నుంచి ఫిబ్రవరి 5 మధ్య కాలంలో రెండు వారాల కంటే ముందున్న ఫిట్ నెస్ లో 50శాతం మెరుగయ్యారట.