×
Ad

Mukesh Ambani, Anand Mahindra:యూఎస్‌ మోదీ విందులో భారతీయ ప్రముఖులు

గురువారం వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.....

  • Published On : June 23, 2023 / 07:08 AM IST

మోదీ డిన్నర్ లో సుందర్ పిచాయ్, ముకేష్ అంబానీ దంపతులు

Mukesh Ambani, Anand Mahindra To Attend PMs State Dinner: గురువారం వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.(PM’s State Dinner)వైట్ హౌస్ సౌత్ లాన్‌లో ప్రత్యేకంగా అలంకరించిన పెవిలియన్‌లో జరిగిన ఈ విందుకు 400 మందికి పైగా అతిథులను వైట్ హౌస్ ఆహ్వానించింది.(PM Modi US Visit 2023)

PM Modi In US Congress:ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయం..యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు

శాకాహారి అయిన ప్రధాని మోదీ కోసం వైట్ హౌస్ సిబ్బంది అద్భుతమైన శాఖాహారం మెనూని రూపొందించారు. అతిథులు తమ ప్రధాన కోర్సులో చేపలను చేర్చారు.అతిథుల జాబితాలో యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి పేర్లు ఉన్నాయి. ఈ విందుకు హాజరైన ప్రభుత్వ ప్రతినిధుల్లో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.

Raj Patel Wine on Menu: మోదీ డిన్నర్ మెనూలో గుజరాతీ రాజ్‌పటేల్ రెడ్ వైన్

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ,భారతీయ సంతతికి చెందిన యూఎస్ ప్రతినిధులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ విందు అతిథుల్లో పలాష్ గుప్తా, ఖుషీ గుప్తా,వనితా గుప్తా, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ రాజీవ్ గుప్తా,గీతా రావు గుప్తా, గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ రాయబారి అరవింద్ గుప్తా,రాహుల్ గుప్తా, నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ ఆఫీస్ డైరెక్టర్ సీమా గుప్తాలు ఉన్నారు. అమెరికన్ అధికారులతోపాటు పలువురు ఎన్ఆర్ఐలు ఈ విందులో పాల్గొన్నారు.