Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్లో ఎటు చూసినా శవాల గుట్టలే…2,445కు చేరిన మృతుల సంఖ్య
అఫ్ఘానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం హెరాత్ నగరంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. భూకంప మృతుల సంఖ్య 2,445కి పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువని అఫ్ఘాన్ విపత్తుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయీఖ్ తెలిపారు....
- saleem sk
- Published On : October 9, 2023 / 08:03 AM IST
earthquake
Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం హెరాత్ నగరంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. భూకంప మృతుల సంఖ్య 2,445కి పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువని అఫ్ఘాన్ విపత్తుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయీఖ్ తెలిపారు. ఆఫ్ఘానిస్థాన్లో సంభవించిన భూకంపాలలో 2,445 మందికి పైగా మరణించారని తాలిబాన్ పరిపాలన ఆదివారం తెలిపింది, భూకంపాలకు గురయ్యే పర్వత ప్రాంతంలో తరచూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
Also Read : Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
పశ్చిమాన శనివారం సంభవించిన భూకంపాలు హెరాత్ నగరానికి వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరం తాకాయి. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూ ప్రకంపనల్లో 50,000 మంది మరణించారు. 1,320 ఇళ్లు దెబ్బతిన్నాయని సయీక్ చెప్పారు.
Also Read :Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం
ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో పది రెస్క్యూ టీమ్లు ఉన్నాయని సయీక్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రెస్క్యూ, రిలీఫ్ కోసం ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, టెంట్లు అత్యవసరంగా అవసరమని ఖతార్లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి సుహైల్ షాహీన్ మీడియాకు తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లో శోధన, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
