Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం

ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి....

Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం

Hamas Attack

Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌లో 260 మృతదేహాలు కనుగొన్నారు. నృత్యవేడుక చుట్టుపక్కల రాకెట్ దాడితో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

Also Read :Uttarakhand : నైనిటాల్‌లో లోయలో పడిన బస్సు…ఆరుగురి మృతి, 27 మందికి గాయాలు

దీంతో హమాస్ ముష్కరులు దాడి చేసి తప్పించుకునేందుకు యత్నిస్తున్నా వారిపై కాల్పులు జరిపారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీకి వేలాది మంది యువకులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన పాలస్తీనా ముష్కరులు 260 మందిని హతమార్చారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దేశంలో 1000 మంది ఇజ్రాయిలీలు హతం కాగా, మరికొంతమందిని అపహరించి గాజాలోకి తీసుకెళ్లారు.

Also Read : Telangana Assembly Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 72గంటల్లో ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల

మిలిటెంట్లు నృత్యవేడుకలోని వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఈ దాడి నుంచి రక్షించుకునేందుకు పారిపోతున్న ఇజ్రాయిలీలను ఉగ్రవాదులు వెంటాడి కాల్చి చంపారు. మిలిటెంట్ల దాడుల్లో పలువురు పారిపోతూ కార్లలోనే తుదిశ్వాస విడిచారు.