×
Ad

PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు....

  • Published On : July 16, 2023 / 05:36 AM IST

PM Modi lands in Delhi

PM Modi lands in Delhi : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు. యూఏఈలోని అబుదాబి పర్యటన ముగించుకొని మోదీ నిష్క్రమణ సమయంలో హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా యూఏఈ ప్రభుత్వ అధికారులు తరలివచ్చారు. (PM Modi lands in Delhi)

NDA Meeting : కీలక పరిణామం.. ఎన్డీయే భేటీకి జనసేనకు ఆహ్వానం

యూఏఈ ఆతిథ్యానికి హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి కృతజ్ఞతలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. (concluding his visit to UAE, France) యూఏఈతో తమ ఆర్థిక సంబంధాలు రెండు దేశాల చరిత్రలో ముఖ్యమైన మైలు రాయి అని మోదీ పేర్కొన్నారు. 80 శాతం వస్తువులపై సుకంాలను తొలగించడం, తగ్గించడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డంకులు తొలిగాయి.